telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

వైసీపీ శ్రేణులు అనాగరికంగా ప్రవర్తిస్తున్నారు: చంద్రబాబు

chandrababu

వైసీపీ శ్రేణులు అనాగరికంగా ప్రవర్తిస్తున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. కర్నూలు జిల్లాలో దివ్యాంగుల దినోత్సవం కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం వచ్చిన టీడీపీ కార్యకర్తలపై 640 దాడులు జరిగాయని చంద్రబాబు మండిపడ్డారు. అక్రమ కేసులను బనాయిస్తున్నారని అన్నారు.

దాడులపై ఫిర్యాదులు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదని చెప్పారు. వైసీపీ మంత్రులు బూతుల మంత్రులుగా తయారయ్యారని దుయ్యబట్టారు. వైయస్ వివేకాను ఇంట్లోనే హత్య చేసి, కేసును తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.దివ్యాంగులకు మొదటి నుంచి టీడీపీనే అండగా ఉందన్నారు.

Related posts