telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

టీడీపీ నేతలపై కక్ష సాధించడమే వైసీపీ అజెండా: చంద్రబాబు

chandrababu

టీడీపీ నేతలపై కక్ష సాధించడమే వైసీపీ అజెండా అని ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు అన్నారు.గత టీడీపీ ప్రభుత్వం ఐదేళ్లలో తీసుకున్న నిర్ణయాలపై వైసీపీ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేయడంపై తెలుగుదేశం పార్టీ నేతలు నిప్పులు చెరిగారు. ఈ మేరకు వరుస ట్వీట్లు చేశారు. ఈ ప్రభుత్వానికి టీడీపీ మీద ఎంత కక్ష ఉందో చెప్పడానికి ఇది మరో ఉదాహరణ అని విమర్శించారు. తొమ్మిది నెలల్లో 3 సిట్ లు, అయిదారు కమిటీలు వేయడం ద్వారా టీడీపీ నే కాదు ఏకంగా ఏపీనే టార్గెట్ చేశారని,మండిపడ్డారు.

వైసీపీ పాలనలో రాష్ట్రాభివృద్ధికి అడ్డుపడటం, పెట్టుబడులను తరిమేయడం తప్ప ఏం సాధించింది? అని ప్రశ్నించారు. గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో తనపై 26 విచారణలు చేయిస్తే ఏమైంది? ఇదీ అంతే అని కొట్టిపారేశారు. టీడీపీ ఏనాడూ ఎటువంటి తప్పులు చేయలేదని, వైసీపీ బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదని బాబు స్పష్టం చేశారు.గత ఐదేళ్ల నిర్ణయాలపై మీరు సిట్ వేశారు. మీ ఐదేళ్ల పాలనపై రేపు రాబోయే ప్రభుత్వం సిట్ వేస్తుందన్నారు.

Related posts