telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

తొలి రోజు నుంచే జగన్ అరాచకాలను ప్రారంభించారు: చంద్రబాబు

chandrababu

ఏపీ సీఎం జగన్ పై టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ధ్వజమెత్తారు. కాకినాడలో నిర్వహించిన తూర్పుగోదావరి జిల్లా టీడీపీ విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి అయిన తొలి రోజు నుంచే జగన్ అరాచకాలను ప్రారంభించారని విమర్శించారు. ఏ కొత్త ప్రభుత్వమైనా తొలి వంద రోజుల్లో ఒక దశాదిశను ఏర్పాటు చేసుకుంటుందని, వైసీపీ ప్రభుత్వం మాత్రం వంద రోజుల్లో ప్రజల్లో అప్రతిష్టపాలైందని అన్నారు.

రివర్స్ టెండరింగ్ అంటూ రాష్ట్రాన్ని రివర్స్ చేశారని దుయ్యబట్టారు. రాజధాని అమరావతిని చంపేసే స్థితికి తెచ్చారని అన్నారు. ఒక్క పైసా ఖర్చు లేకుండా సెల్ఫ్ ఫైనాన్సింగ్ తో ముందుకు వెళ్లే ప్రాజెక్టును దెబ్బతీశారని అన్నారు. ప్రశాంతంగా ఉండే తూర్పుగోదావరి జిల్లాలో కూడా దాడులు జరగడమేంటని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి రాక్షస ప్రభుత్వాన్ని ఎన్నడూ చూడలేదని చెప్పారు. వైఎస్ వివేకానందరెడ్డిని ఇంట్లోనే చంపినప్పటికీ, ఇంత వరకు హంతకులను గుర్తించలేదని దుయ్యబట్టారు.

Related posts