టీడీపీ అధినేత. ఏపీ మాజీ సీఎం చంద్రబాబునాయుడు ఇంటిపై డ్రోన్ వదిలిన వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారం పై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం ఇంట్లో ఒకాయన కూర్చొని తన ఇంటిపైకి డ్రోన్ పంపారని చంద్రబాబు ఆరోపించారు. డ్రోన్ ద్వారా ఫొటోలు తీయడమే కాదు, బాంబులు కూడా పంపొచ్చు అని వ్యాఖ్యానించారు.
కృష్ణా నది వరదముంపు ప్రాంతాల్లో ఈరోజు ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇవి కృత్రిమంగా వచ్చిన వరదలు అని అన్నారు. జలాశయాలు నింపే ప్రయత్నం చేయకుండా నీటిని ఇళ్ల పైకి వదిలారని చెప్పారు. ముంపు ప్రాంతాల్లో మంచినీళ్లుకూడా సరఫరా చేయలేదని విమర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వం ముందుకొచ్చి బాధితులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. మంత్రులు తన ఇంటిచుట్టూ తిరిగారే తప్ప ప్రజల బాగోగులు పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు.
కేంద్ర నిధులను రాబట్టడంలో జగన్ విఫలం: యనమల