ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన మీడియాతో మాట్లాడారు. తమను ప్రశ్నించిన వారందరినీ ఏపీ ప్రభుత్వం ఇబ్బందులకు గురి చేస్తోందని తెలిపారు. మీడియాపై ఆంక్షలు ఎందుకు పెడుతున్నారని ఆయన ప్రశ్నించారు. మీడియా ప్రభుత్వ తీరును తెలిపితే ఎల్లో మీడియా అంటున్నారని మండిపడ్డారు.
మద్యం దుకాణాల ముందు ఉపాధ్యాయులను పెట్టి, ఆ వృత్తిని అపహాస్యం చేశారని చెప్పారు. పీపీఈ కిట్లు ఇవ్వాలని అడిగితే డాక్టర్ సుధాకర్ను సస్పెండ్ చేశారని చంద్రబాబు అన్నారు. సుధాకర్ను తాగుబోతు అని అన్నారని, మానసిక పరిస్థితి బాగోలేదని ప్రచారం చేశారని చెప్పారు. సుధాకర్ విషయంలో తమపై కూడా అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. రంగనాయకమ్మ అనే వృద్ధురాలు సోషల్ మీడియాలో పోస్టులు పెడితే నోటీసులు పంపారని గుర్తు చేశారు. ప్రశ్నించిన వారిపై కేసులు పెట్టి భయభ్రాంతులకు గురి చేస్తున్నారని విమర్శించారు.
కేంద్రం ప్రకటించిన రైల్వే జోన్..మసిబూసిన మారేడుకాయ: చంద్రబాబు