ఏపీ సర్కార్ బార్లకు అనుమతి ఇవ్వడంపై టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న తప్పుపట్టారు. వైసీపీ ప్రభుత్వ తీరుతో ఆంధ్రప్రదేశ్ మధ్యాంద్రప్రదేశ్గా మారిపోయిందన్నారు. కరోనా కారణంగా 40% మంది ఉద్యోగాలు కోల్పోయి రోడ్డున పడ్డారు. ప్రభుత్వం వారిపై దృష్టి పెట్టకుండా ప్రభుత్వం బార్లు మరియు లిక్కర్పై దృష్టి సారించటం సిగ్గుచేటన్నారు.
రాష్ట్రంలో కరోనా కేసులు రోజుకూ వేల సంఖ్యలో పెరుగుతుంటే ఈ సమయంలో ప్రభుత్వం బార్లకు అనుమతి ఇవ్వాల్సిన అవసరం ఏంటి? అని ప్రశ్నించారు. ఇప్పటికే మద్యం షాపులు తెరిచి వేల సంఖ్యలో ఉన్న కరోనా కేసుల్ని లక్షల సంఖ్యలోకి మార్చి కరోనాలో ఏపీని దేశంలో 2వ స్థానానికి చేర్చారు. ఇప్పుడు బార్లు బార్లాగా తెరచి ఇంకెంత మందిని కరోనా బారిన పడేస్తారు? అని ప్రశించారు.