telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

మద్యం దుకాణాల్లో ఉద్యోగాలు వైసీపీ కార్యకర్తలకే: బుద్ధా వెంకన్న

ycp jagan with malya meeting said budda

అక్టోబర్ 1 నుంచి ఏపీ ప్రభుత్వం కొత్త మద్యం దుకాణాలను ఏర్పాటు చేయనుంది. ప్రభుత్వం మద్యం దుకాణాల నిర్వహణకు సిబ్బందిని నియమించేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నేపథ్యంలో నూతన మద్యం విధానం పై టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ట్విటర్ లో స్పందించారు. కొత్తగా ఏర్పాటు చేసే మద్యం దుకాణాలను వైసీపీ నాయకులకు చెందిన షాపుల్లోనే నెలకొల్పుతున్నారని ఆరోపించారు.

జగనన్న మద్యం దుకాణాల్లో వైసీపీ కార్యకర్తలకే ఉద్యోగాలు ఇస్తున్నారని బుద్ధా ఆరోపించారు. నూతన మద్యం దుకాణాల్లో ఏదైనా కంపెనీకి చెందిన బ్రాండ్ అమ్మకానికి పెట్టాలంటే 2 శాతం J-ట్యాక్స్ తప్పనిసరి అని ట్వీట్ చేశారు. సూపర్ గా ఉంది 420 తాతయ్యా మీ మద్యపాన నిషేధం స్కామ్ అంటూ పరోక్షంగా విజయసాయిరెడ్డిపై ఎద్దేవా చేశారు.

Related posts