telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

జగన్ గారి మొసలి కన్నీరు ఎందుకు?: బుద్ధా వెంకన్న

budda venkanna fire on ap govt

శాసన మండలి రద్దు ప్రతిపాదనలపై టీడీపీ నేతలు చేస్తోన్న వ్యాఖ్యలపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యల పై టీడీపీ నేత బుద్ధా వెంకన్న ఘాటుగా స్పందించారు. 1200 కోట్ల రూపాయలతో పంచాయతీ భవనాలకు, శ్మశానాలకు రంగులు వేశారు. 20 కోట్ల రూపాయలు పెట్టి కట్టిన ఇల్లుని మళ్లీ కట్టారు. ఇప్పుడు మండలి ఖర్చు భారం అవుతుంది అంటూ జగన్ గారి మొసలి కన్నీరు ఎందుకు విజయసాయిరెడ్డి గారు?’ అని బుద్ధా వెంకన్న ప్రశ్నించారు.

తాను తీసుకుంటున్న చెత్త నిర్ణయాలకు అడ్డుగా ఉంది అందుకే రద్దు చేస్తున్నా అని ప్రకటించే దమ్ము లేదా? మాట మార్చే, మడమ తిప్పే బ్రతుకు ఎలా మారుతుంది? 4 లక్షల మంది వైకాపా కార్యకర్తలకు గ్రామ వాలంటీర్ల పేరుతో 12 వేల కోట్ల రూపాయలు దోచేస్తున్నారని బుద్ధా ఆరోపించారు.

Related posts