telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

మాకు ఏం జరిగినా పోలీసులే బాధ్యత వహించాలి: బోండా ఉమ

tdp bonda uma counter on ycp comments

తమకు ఏం జరిగినా పోలీసులే బాధ్యత వహించాలని టీడీపీ నేత బోండా ఉమ అన్నారు. తనను, బుద్ధా వెంకన్నను చంపేందుకు వైసీపీ నేతలు నిన్న మూడు సార్లు ప్రయత్నించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ హత్యాయత్నానికి సంబంధించిన స్కెచ్ మొత్తం తాడేపల్లి కార్యాలయం నుంచే జరిగిందని చెప్పారు.

మాచర్లకు తాము వెళ్తున్న సమాచారాన్ని ఎమ్మెల్యే పిన్నెల్లికి పోలీసులే ఇచ్చారని ఉమ ఆరోపించారు. తమకు పోలీసులపై నమ్మకం పోయిందని చెప్పారు.వైసీపీ ప్రభుత్వం అప్రజాస్వామికంగా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు సహా పార్టీకి చెందిన అందరు నేతల ఫోన్లను జగన్ సర్కార్ ట్యాప్ చేయిస్తోందని ఆరోపించారు.

Related posts