telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

టీడీపీ నేతలతో గవర్నర్ ను కలిసిన అఖిలప్రియ

bhuma akhila into ycp soon

టీడీపీ నాయకురాలు, మాజీ మంత్రి భూమా అఖిలప్రియ ఈరోజు టీడీపీ నేతలతో కలిసి గవర్నర్ బిశ్వభూషణ్ ను కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ తమ దుస్థితి మరెవరికీ రాకూడదని గవర్నర్ కు ఫిర్యాదు చేశామని చెప్పారు. తమ కుటుంబాన్ని వైసీపీ ప్రభుత్వం తప్పుడు కేసులతో వేధిస్తోందని ఆరోపించారు. తన భర్తపై ఎలాంటి ఆధారాలు లేకుండానే తప్పుడు కేసులు పెట్టారని మండిపడ్డారు.

టీడీపీ నేత వర్ల రామయ్య మాట్లాడుతూ పోలీసులను అడ్డం పెట్టుకుని అఖిలప్రియ కుటుంబాన్ని వేధిస్తున్నారని అన్నారు. వైసీపీ ప్రభుత్వం కక్షపూరిత రాజకీయాలను చేస్తోందని మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రతిపక్షమే లేకుండా చేయాలని సీఎం జగన్ కుట్రలు చేస్తున్నారని అన్నారు.

Related posts