telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

వైసీపీ మహిళా ఎమ్మెల్యేలపై టీడీపీ నేత అనురాధ ఫైర్

Panchumarthi-Anuradha

వైసీపీ మహిళా ఎమ్మెల్యేలపై టీడీపీ నాయకురాలు పంచుమర్తి అనురాధ మండిపడ్డారు. విజయవాడలో ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఈరోజు అసెంబ్లీలో వైసీపీ మహిళా ఎమ్మెల్యేల వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు. వైసీపీ నారీమణులు తమ ఇష్టానుసారం మాట్లాడారని అన్నారు. మహిళలపై వాళ్లకే ప్రేమ ఉన్నట్టు, ఎవరికీ లేనట్టుగా మాట్లాడారని విమర్శించారు.

వైసీపీ నాయకుడు గోరంట్ల మాధవ్ ఓ రేప్ కేసులో నిందితుడని, రెండు నెలలు జైల్లో ఉండొచ్చాడని, రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ వరకట్న వేధింపుల కేసులో నిందితుడని, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఒక మహిళా అధికారిణి ఇంటికి వెళ్లి బెదిరించారని.. అటువంటి వ్యక్తులున్న పార్టీకి చెందిన మహిళా ఎమ్మెల్యేలు మహిళల గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని అన్నారు.

Related posts