వైసీపీ ఎమ్మెల్యే రోజాపై టీడీపీ నాయకురాలు పంచుమర్తి అనురాధ విమర్శనాస్త్రాలు సంధించారు. ఈ రోజు అమరావతిలో ఆమె మీడియాతో మాట్లాడుతూ… ప్యాకేజీల కోసమే టీడీపీ నేతలపై రోజా వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. రాజధాని అమరావతిలో గత టీడీపీ ప్రభుత్వం చేసిన అభివృద్ధికు కనిపించడం లేదా? అని నిలదీశారు. రోజా ఓ సారి కళ్ల పరీక్ష చేయించుకోవాలని ఆమె ఎద్దేవా చేశారు.
ఏడు నెలల్లో ఆంధ్రప్రదేశ్లో జరిగిన అత్యాచారాల సంఖ్య రోజాకు తెలుసా? అని ఆమె నిలదీశారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో వైసీపీ వేసిన కమిటీలకు చట్టబద్ధత లేదని ఆమె మండిపడ్డారు. వైసీపీ నేతలు ఎన్నో అవినీతి కేసుల్లో నిందితులుగా ఉన్నారని, అటువంటి వారికి టీడీపీపై ఆరోపణలు చేసే అర్హత లేదన్నారు.