telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

సీఎం జగన్ కు దెయ్యం పట్టింది: పంచుమర్తి అనురాధ

Panchumarthi-Anuradha

ఏపీ సీఎం జగన్ పై తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి పంచుమర్తి అనురాధ విమర్శనాస్త్రాలు సంధించారు. సీఎం జగన్ కు దెయ్యం పట్టిందని అనురాధ ఆరోపించారు. జగన్ కు పట్టిన దెయ్యాన్ని తెలుగుదేశం ప్రభుత్వమే వదిలిస్తుందని ఆమె స్పష్టం చేశారు. జగన్ కు ప్రజల్లో తిరిగే దమ్ము ధైర్యం లేదంటూ మండిపడ్డారు. భ్రష్టుపట్టిపోయిన విధానాలతో వైసీపీ ప్రభుత్వం పయనిస్తోందంటూ విరుచుకుపడ్డారు. అన్ని రంగాల్లో జగన్ ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. రాష్ట్రంలో నెలకొన్న సమస్యలపై ప్రజలు ఆందోళన చేస్తుంటే ప్రభుత్వానికి వినిపించడం లేదన్నారు.

ఈ ప్రభుత్వం గుడ్డి ప్రభుత్వమంటూ ధ్వ్వజమెత్తారు. మూగ పరిపాలనను ప్రజలు భవరించలేకపోతున్నారన్నారు. గోదావరి నదిలో బోటు ప్రమాదంలో చనిపోయిన బాధితుల ఆర్తనాదాలు వినలేని దుస్థితిలో జగన్ ఉన్నారని ఆరోపించారు. బోటు ప్రమాదంలో సుమారు 30 మందికి పైగా చనిపోయినా ప్రభుత్వానికి చీమైనా కుట్టినట్లు లేకుండా పోయిందన్నారు. బోటు ప్రమాదంలో చనిపోయిన బాధితుల ఆర్తనాదాలు ప్రభుత్వానికి వినబడటం లేదని మండిపడ్డారు.

Related posts