ఈ మధ్య బంగారం ధర మాత్రం ఎగబాకుతూనే ఉంది.. ఇంత కాలం ధర ఇంకా తగ్గుతుందేమోనని ఎదురుచూసిన పసిడి ప్రేమికులకు వరుసగా ధరల పెరుగుదల షాక్ ఇస్తోంది. ఈ తరుణంలో ఉగాది పండుగ సమయంలో బంగారం లాంటి ఆఫర్ తెచ్చింది ప్రముఖ జువెలరీ సంస్థ తనిష్క్.. తన సంస్థలో బంగారం కొనేవారి కోసం ఓ ఆఫర్ అందుబాటులోకి తెచ్చింది తనిష్క్.. గోల్డ్ జువెలరీ తయారీ చార్జీల్లో 25 శాతం వరకు తగ్గింపు అందిస్తున్నట్టు ప్రకటించింది.. ఈ ఆఫర్ కేవలం బంగారు నగలకు మాత్రమే కాకుండా డైమండ్ జువెలరీకి కూడా వర్తించనుంది. అయితే, ఉగాది సందర్భంగా తెచ్చిన ఈ ఆఫర్ ఎన్ని రోజులు ఉంటుంది అనేదానిపై మాత్రం క్లారిటీ రావాల్సి ఉంది. తనిష్క్ తో పాటు మరో ప్రముఖ సంస్థ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ కూడా ఓ ఆఫర్ తెచ్చింది.. డైమండ్ జువెలరీపై 25 శాతం వరకు తగ్గింపు ఇస్తున్నట్టు ప్రకటించింది. మరోవైపు.. ఇవాళ బులియెన్ మార్కెట్ పసిడి ధరలు కాస్త పైకి కదిలిన సంగతి తెలిసిందే. అయితే మీరు కూడా వెళ్లి తీసుకోవాలి అనుకుంటే వెళ్ళండి.
previous post
రాశిఖన్నా వేధించేది… వర్మ “నగ్నం” హీరోయిన్ వ్యాఖ్యలు