తెలంగాణ నూతన గవర్నర్ గా తమిళిసై సౌందరరాజన్ ఈ నెల 8వ తేదీన బాధ్యతలను స్వీకరించబోతున్నారు. కొత్త గవర్నర్ గా ఆమెకు నియామక పత్రం అందింది. ఢిల్లీలోని తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ వేదాంతం గిరి చెన్నైలో తమిళిసైను కలిసి నియామకపత్రాన్ని అందించారు.
ఆదివారం ఉదయం 11 గంటలకు తమిళిసై సౌందర్ రాజన్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. తమిళిసై సౌందర్ రాజన్చే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆర్ఎస్ చౌహాన్ ప్రమాణస్వీకారం చేయించనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు, అధికారులు హాజరు కానున్నారు. తెలంగాణ తొలి మహిళా గవర్నర్గా ఆమె రికార్డు సృష్టించనున్నారు. తమిళసై ప్రమాణస్వీకారానికి సంబంధించి ఏర్పాట్లు జరుగుతున్నాయి.