telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

వయో పరిమితి పెంపు బిల్లుకు గవర్నర్ ఆమోదం…

Tamilisai Soundararajan governor

ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు 58 ఏళ్ల నుండి 61 ఏళ్లకు పెంచుతూ శాసన సభ ఆమోదించిన బిల్లును.. రాజ్‌భవన్‌కు పంపించారు అధికారులు.. అయితే, ఆ బిల్లుకు గవర్నర్ తమిళిసై ఆమోదం తెలిపారు.. ఇక, గవర్నర్ ఆమోదించిన ఆ కాపీ ప్రభుత్వానికి చేరగానే గెజిట్ నోటిఫికేషన్ విడుద చేయనున్నారు. మొత్తంగా ఈ నెల నుండే వయోపరిమితి పెంపును అమలు చేయడానికి సిద్ధమైంది ప్రభుత్వం.. ఇవాళే దీనికి సంబంధించిన ఉత్తర్వులు కూడా వెలువడే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. దీంతో.. మార్చి నెలలో రిటైర్ కావాల్సిన 770 మంది ఉద్యోగులకు లబ్ధి చేకూరనుంది. కాగా, ఉద్యోగుల పదవి విరమణ వయస్సు.. కొత్త ఉద్యోగాల భర్తీపై పడుతుందనే ఆందోళనలు వ్యక్తం అవుతుండగా… ఉద్యోగాల బర్తీకి ఇది ఎలాంటి అడ్డంకి కాబోదనే స్పష్టం చేస్తోంది ప్రభుత్వం. అయితే ఇలా చేయడం పై నిరుద్యోగులు మాత్రం ఆందోళన చేస్తున్నారు. చూడాలి మరి వారికి ప్రభుత్వం ఏ విధమైన సమాధానం చెబుతుంది.

Related posts