ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన సినిమా ‘పుష్ప ది రైజ్’ . సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన మొదటిబాగం ‘పుష్ప ది రైజ్’ విడుదలైంది. శేషాచలం ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్య కథతో తీసిన ఈ సినిమాలో రష్మిక మందన్నా నటించింది.
ఇక పోతే..టాలీవుడ్లో అగ్రహీరోయిన్ సమంత ఈ సినిమాలో ఐటం సాంగ్ చేసింది. ఈ పాటకు అన్ని భాషల్లో అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది కానీ అదే రేంజ్లో వివాదాలు కూడా చుట్టుముడుతున్నాయి. ఇప్పటికే ఈ పాటపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఏపీ పురుషుల సంఘం కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. పురుషులందరిని చెడ్డగా చూపించేలా ఈ పాట ఉందని, ఈ సాంగ్ బ్యాన్ చేయాలంటూ డిమాండ్ చేసింది పురుషుల సంఘం.
తాజాగా ఈ పాటకు తమిళంలోనూ వ్యతిరేకత వస్తోంది. ‘మగవాళ్ల బుద్ధే వంకర బుద్ధి” అనే లిరిక్స్ పాటలో వివాదం గా ఉన్నాయని, ఈ పాటను తొలగించకుంటే సమంత, పాట పాడిన ఆండ్రియా, గేయరచయిత వివేకా, సంగీత దర్శకుడు దేవీశ్రీ సంగీత దర్శకుడు దేవీశ్రీ ప్రసాద్, గేయరచయిత వివేకాపై కేసు పెడతామని హెచ్చరించింది. ‘ఓ సొల్రియా’ అనే పాట తమిళంలోనూ సూపర్ హిట్ అయింది. తెలుగులో ఈ పాటను చంద్రబోస్ రాయగా, తమిళంలో వివేకా రాశారు.
కాగా.. ఇప్పటికే ఈ పాట యూట్యూబ్ ను షేక్ చేస్తుంది. ఏకంగా 20 మిలియన్ పైగా వ్యూస్ దాటేసింది. ఈ పాటకు అంత క్రేజ్ రావడం సమంత వలనే అనడంలో ఏమాత్రం సందేహంలేదు. కానీ అన్నీ వైపుల నుంచి వ్యతిరేకత మైదలైంది.