telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

కరోనా కాటుకు మరో నటుడు బలి

Florinta

దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. కేంద్రప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నప్పటికీ కరోనా ఉధృతి తగ్గట్లేదు. సాధారణ ప్రజలతో పాటు అధికారులు, పోలీసులు, సెలబ్రిటీలు సైతం కరోనా బారిన పడటం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే పలువురు బాలీవుడ్ నటీనటులు కరోనా మహమ్మారి బారిన పడ్డ సంగతి తెలిసిందే. కొంతమంది నటులు కూడా కరోనా బారిన పడుతున్నారు. కొంతమంది ఈ వైరస్ బారినపడి కన్నుమూశారు. హాలీవుడ్ బాలీవుడ్ లో కొందరు సెలబ్రిటీలు కరోనాతో మృతి చెందారు. తాజాగా ప్రముఖ తమిళ నటుడు కరోనా బారినపడి కన్నుమూశారు. ఫ్లోరెంట్ పెరిరా అనే నటుడు కరోనా కారణంగా మృత్యువాత పడ్డారు. ఫ్లోరెంట్ పెరిరా తమిళ, మలయాళ సినిమాల్లో నటించి మెప్పించారు. ఆయన వయసు 67 సంవత్సరాలు. ఈయనకు రాజా మంతిరి, ధర్మదురై, తోడరి, ముప్పారిమనమ్,సత్రియాన్ వంటి చిత్రాల్లో నటనతో ఆకట్టుకున్నారు. ఇటీవలే ఆయన బీజేపీలో చేరారు. ఫ్లోరెంట్ పెరిరా మృతికి తమిళనాడుకు చెందిన సినీనటులుతో పాటు రాజకీయ నాయకులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

Related posts