telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

సినీ పరిశ్రమలో విషాదం : స్టార్ కమెడియన్ మృతి

చైనా లో పుట్టిన కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తోంది. ఇప్పటికే చాలా దేశాలు ఈ వైరస్ కారణంగా కుదేలు అయ్యాయి. ఇక మన దేశంలోనూ ఈ వైరస్ విలయం కొనసాగుతూనే ఉంది. అటు ఇప్పటికే రాజకీయ నాయకులకు, సినిమా స్టార్లకు, ప్రముఖులకు కరోనా సోకింది. ముఖ్యంగా సినిమా పరిశ్రమలో కరోనా కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. దీంతో షూటింగ్ లు ఆగిపోతున్నాయి. అయితే తాజాగాతమిళ కమెడియన్ పాండు (74) ఇవాళ కరోనా తో మృతి చెందారు. ఆయన కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతుండగా.. ఆస్పత్రిలో చేర్పించారు. అయితే టెస్టుల్లో పాజిటివ్ రావడంతో కోవిడ్ ఆస్పత్రిలో వైద్యం అందించారు. పరిస్థితి విషమించడంతో ఇవాళ ఆయన మృతి చెందారు.

Related posts