దేశంలో కరోనా వైరస్ ఉదృతి రోజురోజుకూ పెరిగిపోతోంది. ఇప్పటికే సామాన్య ప్రజలతో పాటు ఎంతోమంది సినీ తారలు కరోనా బారిన పడ్డారు. ఇందులో కొందరు కోలుకోగా.. ఇంకొందరు ఆ మహమ్మారి దాడికి బలైపోవడం సినీ వర్గాల్లో కలకలం సృష్టిస్తోంది. ఈ పరిస్థితుల్లో స్టార్ హీరోయిన్ తమన్నా సైతం కరోనా బారిన పడిందని తెలిసి ఆందోళన చెందుతున్నారు ఆమె అభిమానులు. కొన్నిరోజుల క్రితం తమన్నా తల్లిదండ్రులకు కరోనా సోకిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో వారితోనే కలిసి ఉన్న మిల్కీ బ్యూటీ టెస్ట్ చేయించుకోగా నెగెటివ్ అనే రిపోర్ట్ రావడంతో ఆమె అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ఇక ఇటీవలే షూటింగ్స్ రీ ఓపెన్ కావడంతో ఓ సినిమా షూటింగ్ కోసం తమన్నా హైదరాబాద్ వచ్చింది. ఇంతలో ఆమెకు హై ఫీవర్ రావడంతో హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చగా కరోనా టెస్ట్ చేశారు. ఈ రిపోర్ట్లో ఆమెకు కరోనా సోకినట్లు తేలడంతో అంతా షాకయ్యారు. ఇక ప్రస్తుతం తమన్నా గుర్తుందా శీతాకాలం, సిటీమార్, అంధధూన్ రీమేక్తో పాటు ఓ వెబ్ సిరీస్లో కూడా నటిస్తోంది.
previous post