మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా తెలుగులో రవితేజ సరసన ఓ సినిమాలో నటించడం కోసం ఆమె రెండున్నర కోట్ల పారితోషికాన్ని డిమాండ్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. తన మార్కెట్కు మించి ఆమె రెమ్యునరేషన్ కోరడంతో చిత్రబృందం వెనక్కి తగ్గినట్లు వార్తలు వచ్చాయి. ఈ పుకార్లపై తమన్నా స్పందిస్తూ ‘పారితోషికం అనేది తారల ఇమేజ్, ఆర్థిక విలువను అనుసరించి ఉంటుంది. రెమ్యునరేషన్ విషయంలో చిత్రసీమలో నాయకానాయికల మధ్య అంతరాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇండస్ట్రీలో కథానాయికలు తమ లక్ష్యాన్ని చేరుకోవడానికి ఎంతో శ్రమిస్తుంటారు. ఓ సినిమా విజయంలో హీరోలతో పాటు హీరోయిన్లు ముఖ్య భూమిక పోషిస్తుంటారు. అయినా పారితోషికం విషయం వచ్చేసరికి హయ్యెస్ట్ పెయిడ్ స్టార్ ట్యాగ్స్ మాత్రం హీరోలకే వర్తిస్తుంటాయి. హీరోలకే ఆ అర్హత ఉంటుంది. కథానాయికల్ని పరిగణనలోకి తీసుకోరు. ఈ ఆలోచన ధోరణిలో మార్పులు రావాల్సిన అవసరం ఉంది’ అని తెలిపింది. సినిమా ఆంగీకరించడం, నిరాకరించడం అంశాలు హీరోతో ఉన్న అనుబంధాన్ని ప్రభావితం చేయలేవు” అని చెప్పింది.
previous post