శ్రీ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన మిల్కీ బ్యూటీ తమన్నా తన అందం, అభినయంతో ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఇప్పటికీ తమన్నా ఇండస్ట్రీకొచ్చి 16 ఏళ్ళైనా స్టార్ హీరోలకు జోడీ కడుతుంది. టాలీవుడ్ నుండి బాలీవుడ్ వరకు వరసపెట్టి కుర్రహీరోలతో కూడా రొమాన్స్ చేస్తుంది.
ఇక తమన్నా “రచ్చ” సినిమా లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సరసన హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసిందే. సంపత్ నంది దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ పొందింది. తాజా సమాచారం ప్రకారం తమన్నా మరొకసారి రామ్ చరణ్ తో రొమాన్స్ చేసేందుకు సిద్ధమైంది
ప్రస్తుతం మోస్ట్ అవెయిటెడ్ క్రేజీ మల్టీస్టారర్ ఆర్ఆర్ఆర్ లో నటిస్తున్న రామ్ చరణ్ ఆ తర్వాత తమిళ దర్శకుడు శంకర్ తో మరో పాన్ ఇండియా చేయనున్నాడు. రాజకీయ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో చెర్రీ ఒక ముఖ్యమంత్రి పాత్రలో కనిపిస్తారు అని వార్తలు వినిపిస్తున్నాయి.
ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా మొదలు కాగా కియారా అద్వానీని హీరోయిన్ గా ఎంపిక చేశారు. తాజా సమాచారం ప్రకారం మరొక హీరోయిన్ పాత్ర కోసం తమన్నాను ఎంపిక చేశారు దర్శక నిర్మాతలు. ఇందులో తమన్నా నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనుందని తెలుస్తోంది. తన పాత్ర నిడివి కేవలం ఇరవై నిమిషాలు మాత్రమే ఉన్నప్పటికీ, ఆమె పాత్ర సినిమాకి హైలైట్ గా ఉంటుందట.