మంచినీళ్లకు ఇబ్బందులు లేకుండా మిషన్ భగీరథతో ఆడపడుచుల కనీళ్లు తుడిచిన ఏకైక సీఎం కేసీఆర్ అని తెలంగాణ మంత్రి హరీష్ రావు కొనియాడారు. సోమవారం గజ్వేల్ ప్టటణంలో ఆడపడుచులకు హరీశ్ రావు బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ . దేశంలో ఎక్కడా లేని విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారని తెలిపారు. జిల్లాలోని 3,65,225 మంది ఆడపడుచులకు బతుకమ్మచీరల పంపిచేస్తున్నామన్నారు.
అధికారులు, ప్రజా ప్రతినిధులు ఇంటింటికి వెళ్లి అర్హులైన వారికి చీరలు పంపిణీ చేయాలని ఆయన సూచించారు. ఆర్థిక మాంద్యం ఉన్నప్పటికి కేసీఆర్ కిట్, కళ్యాల లక్ష్మి, ఆసరా పెన్షన్లకు ఎలాంటి ఆటంకం లేకుండా అందిస్తున్నామని తెలిపారు. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని చేసి కాంగ్రెస్, బీజేపీ నాయకులు ఓర్వలేక పోతున్నారని మండిపడ్డారు.