telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

నా రెమ్యూనరేషన్ పెరిగింది… కానీ డిమాండ్ కాదు… : తాప్సి

Thapsi

తెలుగులో “ఝుమ్మంది నాదం” సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన సొట్ట‌బుగ్గ‌ల సుంద‌రి తాప్సీ ఆ తరువాత బాలీవుడ్ లో అవకాశాలను చేజిక్కించుకుని స్టార్ హీరోయిన్ గా దూసుకెళ్తోంది. అయితే ఈ మిల్కీ బ్యూటీకి కెరీర్ ప్రారంభంలో స‌క్సెస్ అంత ఈజీగా దొర‌క‌లేదు. చాలా క‌ష్ట‌న‌ష్టాల‌ను చవిచూడాల్సి వచ్చింది తాప్సీ. ప్రస్తుతం టాలీవుడ్, బాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అయ్యింది తాప్సీ. ఇటీవలే “గేమ్ ఓవర్” చిత్రంతో తెలుగులో మంచి విజయాన్ని అందుకున్న తాప్సి ఇప్పుడు గుజరాత్‌కు చెందిన రష్మీ అనే అథ్లెట్ పాత్రలో ఆమె కనిపించబోతున్నది. తాప్సీ ప్రధాన పాత్రలో “రష్మీ రాకెట్” పేరుతో ఓ బాలీవుడ్ చిత్రం తెరకెక్కుతున్నది. ఆకర్ష్ ఖురానా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. రోనీ స్క్య్రూవాలా నిర్మిస్తున్నారు. ఇటీవలే `పింక్`, `మిషన్ మంగళ్` వంటి హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంది. బాలీవుడ్‌తోపాటు దక్షిణాది సినిమాల్లోనూ నటిస్తున్న తాప్సీ ఇటీవల తన రెమ్యునరేషన్‌ను పెంచేసిందట. తాజాగా ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయం గురించి తాప్సీ మాట్లాడింది. “నా రెమ్యునరేషన్ పెరిగిన మాట వాస్తవం. అయితే ఆ పెరుగుదల గత రెండేళ్ల నుంచే. అయితే అది నేను డిమాండ్ చేసి తీసుకుంటున్నది కాదు. నిర్మాతలే ఇష్టపూర్వకంగా ఇస్తున్నారు. నా పారితోషికం పట్ల నిర్మాతలు సంతోషంగానే ఉన్నారు. నా రెమ్యునరేషన్ వల్ల సినిమా ఇబ్బంది పడే పరిస్థితిని నేనెప్పుడూ రానివ్వను. పారితోషికం విషయం పక్కనబెడితే మంచి సినిమాలు నన్ను వెతుక్కుంటూ రావడం సంతోషంగా ఉంది” అని తాప్సీ వ్యాఖ్యానించింది.

Related posts