బాలీవుడ్ లో సుశాంత్ మరణం తరవాత నెపోటిజంతో పాటు పలు అంశాలపై తీవ్ర దుమారం రేగుతోంది. స్టార్ హీరోయిన్ దీపిక పదుకునే కొన్నాళ్ల క్రితం పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) కు వ్యతిరేకంగా జేఎన్ యూ విద్యార్థులు చేస్తున్న ఆందోళనకు మద్దతు తెలియజేసింది. ఆ సమయంలో జేఎన్ యూకు వెళ్లి మరీ దీపిక వారికి మద్దతు తెలపడంపై సర్వత్రా చర్చనీయాంశం అయ్యింది. దీపిక 5 కోట్ల రూపాయలు తీసుకుని సీఏఏ వ్యతిరేక పోరాటంకు మద్దతు తెలిపింది అంటూ ప్రచారం సాగుతోంది. ఈ ప్రచారాన్ని మరో హీరోయిన్ స్వర భాస్కర్ తీవ్రంగా ఖండించింది. అది పూర్తిగా అవాస్తవమని పేర్కొంది. బాలీవుడ్ గురించి అలాంటి చెత్త వార్తలను ఎలా ప్రచారం చేస్తున్నారని, అలాంటి వార్తలను నమ్మడం మూర్ఖత్వమని పేర్కొంది.
next post