బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఇప్పటికే ఈ కేసులోకి సీబీఐ ఎంటర్ అయ్యింది. మరోవైపు ఈడీ కూడా పలువురికి సమన్లు జారీ చేసింది. ఇక సుశాంత్ ప్రియురాలు రియా చక్రవర్తి కూడా నిన్న ఈడీ అధికారుల ఎదుట రియా హాజరైంది. ఇదిలా ఉంటే తాజాగా సుశాంత్ను అతని పెంపుడు కుక్క బెల్టుతో ఉరివేసి చంపారని చేసి చంపారంటూ సుశాంత్ సన్నిహితుడు, మాజీ అసిస్టెంట్ అంకిత్ ఆచార్య ఆరోపించారు. సుశాంత్ గురించి నాకు బాగా తెలుసు. ఇది ఆత్మహత్య అంటే నేను నమ్మను. ఖచ్చితంగా హత్యే. ఒకవేళ సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నాడని అనుకున్నా… మెడపై యూ ఆకారంలో మార్క్ ఉండాలి. కానీ ఎవరైనా కొట్టినపుడు, గొంతు నులిమి చంపితేనే మృతుడి మెడ చుట్టూ వృత్తాకారంలో గుర్తులుంటాయన్నారు. సుశాంత్ మెడపై అలాంటి గుర్తులే ఉన్నాయని అంకిత్ పేర్కొన్నాడు. ఒకవేళ ఆత్మహత్య అయితే కళ్లు తేలేసినట్టు, నాలుక బయటకొస్తుంది. నోటి నుంచి నురగ వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఇలాంటి ఏమి లేవని ఆయన అన్నారు. కాబట్టి సుశాంత్ ది ఖచ్చితంగా హత్యేనని అంకిత్ ఆచార్య ఆరోపిస్తున్నాడు. ఈ కేసులో పారదర్శకంగా విచారణ జరిపి, నిందితులకు ఉరిశిక్ష వేయాలని డిమాండ్ చేశాడు. దీంతో అంకిత్ వ్యాఖ్యలు పలు అనుమానాలు చోటు చేసుకుంటున్నాయి.
previous post
అందాలు ఆరబోస్తే తప్పేంటి ? : హీరోయిన్