telugu navyamedia
క్రైమ్ వార్తలు తెలంగాణ వార్తలు వార్తలు

భార్య మేనమామను కారుతో తొక్కించి చంపిన కిరాతకుడు!

New couples attack SR Nagar

భార్యను కాపురానికి పంపడం లేదన్న కోపంతో ఓ వ్యక్తి భార్య మేనమామను హతమార్చాడు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా నేరేడుచర్లలో జరిగింది . పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన వేముల శ్రీదేవి, గుంటూరు జిల్లా పిడుగురాళ్లకు చెందిన ఆరెపడి సుజరాజు భార్యాభర్తలు. ఐదేళ్ల క్రితం వీరికి వివాహం జరగ్గా ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. భార్యాభర్తల మధ్య గొడవలు పొడసూపడంతో శ్రీదేవి ఈ నెల 18న పుట్టింటికి వచ్చేసింది.

నిందితుడు భార్యను తనతో పంపాలని కోరాడు. అయితే, ఇప్పుడే పంపబోమని, వివాదం పరిష్కారమయ్యే వరకు ఆమె ఇక్కడే ఉంటుందని శ్రీదేవి కుటుంబ సభ్యులు తెలిపారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన సుజైరాజు తన చిన్న కుమార్తెను కారులో ఎక్కించాడు.గమనించిన శ్రీదేవి మేనమామ శంకర్ (31) కారును అడ్డుకుని ఆమెను ఎక్కడికి తీసుకెళ్తున్నావని ప్రశ్నించాడు. అప్పటికే ఆగ్రహంతో ఉన్న సుజైరాజు శంకర్ ను కారుతో తొక్కించాడు. తీవ్రంగా గాయపడిన శంకర్‌ను ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే అతడు మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని ధర్యాప్తు చేస్తున్నారు.

Related posts