telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

కేసీఆర్ ఆదేశాలతో కదిలిన అధికార బృందం!

KCR cm telangana

తెలంగాణలోని సూర్యాపేటలో కరోనా కేసులు రోజు రోజుకు పెరగడంతో అధికారులకు తలనొప్పిగా మారింది. ఈ ప్రాంతం నుంచి న్యూఢిల్లీ ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారి సంఖ్య అధికంగా ఉండటం, వారిలో అత్యధికులు కూరగాయలు, నిత్యావసరాల వ్యాపారంలో ఉండటంతో కాంటాక్ట్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతూ ఉంది.

దీంతో సూర్యాపేట పట్టణంపై మరింత శ్రద్ధ పెట్టాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. లాక్ డౌన్ ను కఠినంగా అమలు చేసి, వైరస్ లింక్ ను కట్ చేయాలని సూచించారు. కేసీఆర్ ఆదేశాలతో నేడు సూర్యాపేటలో సీఎస్ తో పాటు డీజీపీ, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి, మెడిల్ అండ్ హెల్త్ డైరెక్టర్ తదితరులతో కూడిన బృందం క్షేత్ర స్థాయి పరిస్థితులపై సమీక్ష జరుపనుంది.

Related posts