కరోనా కారణంగా ఐపీఎల్ 2021 సీజన్ అర్థంతరంగా వాయిదా పడటంతో ఇంటికే పరిమితమైన సూర్యకుమార్ యాదవ్.. తాజాగా ఇన్స్టాగ్రామ్లో అభిమానులతో ముచ్చటించాడు. ఫ్యాన్స్ అడిగిన పలు ఆసక్తికర ప్రశ్నలకు ఓపికగా బదులిచ్చాడు. క్రికెట్లో తనకిష్టమైన షాట్ స్వీప్షాట్ అని చెప్పిన సూర్య.. అభిమానుల కోరిక మేరకు టీమిండియా దిగ్గజ క్రికెటర్లపైనా వన్ వర్డ్లో తన అభిప్రాయాలు వ్యక్తపరిచాడు. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, ఓపెనర్ రోహిత్ శర్మతో పాటు మాజీ సారథులు మహేంద్రసింగ్ ధోనీ, సచిన్పై ప్రశంసలు జల్లు కురిపించాడు. కోహ్లీ స్ఫూర్తిదాయకమైన ఆటగాడని, రోహిత్ హిట్మ్యాన్ అని పేర్కొన్నాడు. అయితే గత ఐపీఎల్ సీజన్ సందర్భంగా.. సూర్య, కోహ్లీ మధ్య మైదానంలో సైలెంట్ వార్ నడిచిన నేపథ్యంలో విరాట్ తన స్పూర్తిదాయకమైన ఆటగాడని అతను పేర్కొనడం అభిమానులను విస్మయపరిచింది. ఇక ఇటీవల ఇంగ్లండ్తో జరిగిన టీ20 మ్యాచ్లో సిక్సర్తో హాఫ్ సెంచరీ చేసిన ఫొటోను పోస్టు పంచుకున్నాడు. అయితే సూర్య చెప్పిన సమాధానాలు నెట్టింట హాట్టాపిక్గా మారాయి.
previous post
next post