telugu navyamedia
రాజకీయ వార్తలు

సుప్రీంకోర్టులో కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్ పొడిగింపు పిటిషన్ నిరాకరణ

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు భారీ షాక్ తగిలింది. తనకు ఇచ్చిన మధ్యంతర బెయిల్ను మరో ఏడు రోజులు పొడిగించాలంటూ సుప్రీంకోర్టులో కేజ్రీవాల్ పిటిషన్ వేశారు.

అయితే కేజ్రీవాల్ చేసిన విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకునేందుకు సుప్రీం నిరాకరించింది.

లిక్కర్ పాలసీ కేసులో మనీలాండరింగ్ ఆరోపణలపై మార్చి 21న కేజ్రీవాల్ను ఈడీ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.

తన అరెస్ట్ను సవాల్ చేస్తూ కేజ్రీవాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దానిపై విచారణ ఆలస్యమవుతుండటంతో ఎన్నికల్లో ప్రచారం నిర్వహించుకునేందుకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని అభ్యర్థించారు.

సర్వోన్నత న్యాయస్థానం మే 10న కేజ్రీవాల్కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. జూ 1 వరకూ బెయిల్ మంజూరు చేసింది.
ఇక జూన్ 2న ఆయన లొంగిపోవాల్సి ఉంది. అయితే, తీవ్రమైన అనారోగ్య కారణాల దృష్ట్యా తనకు ఇచ్చిన మధ్యంతర బెయిల్ను మరో 7 రోజులు పొడిగించాలని కోరుతూ కేజ్రీవాల్ సుప్రీంకోర్టులో మరో పిటిషన్ వేశారు. కేజ్రీవాల్ విజ్ఞప్తిని సుప్రీం నిరాకరించింది.

Related posts