సినీ నటుడు మోహన్ బాబు కు సుప్రీంకోర్టులో పెద్ద ఊరట లభించింది. జర్నలిస్టుపై దాడికి సంబంధించి ఆయనపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు.
ఈ కేసులో ఆయన ముందస్తు బెయిల్ కోరుతూ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. అయితే ఆయనకు ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది.
ఆయన హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. మోహన్ బాబు పిటిషన్ ను విచారించిన సుప్రీంకోర్టు ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.
హైదరాబాద్ జల్ పల్లిలోని నివాసం వద్ద 2024 డిసెంబర్ 10న జర్నలిస్టుపై మోహన్ బాబు మైక్ తో దాడి చేసిన సంగతి తెలిసిందే.
ఈ ఘటనకు సంబంధించి మోహన్ బాబుపై పహాడిషరీఫ్ పోలీసులకు బాధిత జర్నలిస్టు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు ఆధారంగా మోహన్ బాబుపై పోలీసులు కేసు నమోదు చేశారు.
కేసు విచారణ సందర్భంగా కావాలని తాను జర్నలిస్టు పై దాడి చేయలేదని సుప్రీంకోర్టుకు మోహన్ బాబు తెలిపారు. కుటుంబ గొడవల నేపథ్యంలో ఒకరిపై మరొకరు ఫిర్యాదులు చేసుకున్నామని చెప్పారు.
బాధిత జర్నలిస్టు కు నష్టపరిహారం ఇచ్చేందుకు కూడా సిద్ధంగా ఉన్నానని మోహన్ బాబు తెలిపారు.