తెలంగాణలో విద్యా శాఖ వేసవి సెలవులను ప్రకటించింది. రాష్ట్రంలోని అన్ని విద్యా సంస్థలకూ రేపటి నుంచి మే 31 వరకూ సెలవులని పేర్కొంది. ఈ 50 రోజులూ అన్ని స్కూళ్లనూ విధిగా మూసివేయాలని ఆదేశించింది. ఇంటర్ లోకి ప్రవేశిస్తున్న విద్యార్థులకు ప్రత్యేక క్లాసుల పేరిట ఎవరైనా స్కూళ్లు నిర్వహిస్తే, కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేసింది.
పలు ప్రముఖ విద్యా సంస్థలు ఇంటర్ ప్రవేశం కోరుతున్న విద్యార్థులకు ముందుగానే క్లాసులు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకున్న విషయం తెలిసిందే. వేసవి సెలవలలో కూడా ప్రత్యేక తరగతులు అంటూ విద్యాసంస్థలు హడావుడి చేయడం ఈ ఏడాదైనా మారనుందేమో చూడాలి.