telugu navyamedia
రాజకీయ వార్తలు

కర్ణాటకలో 300 మంది ఫోన్ల ట్యాప్‌: ఎంపీ సుమలత

sumalatha comments kumara swamy

దేశంలో ఎక్కడా జరగని విధంగా కర్ణాటకలో సుమారు 300 మంది ఫోన్లను ట్యాప్‌ చేశారని మండ్య ఎంపీ సుమలత అంబరీష్‌ ఆరోపించారు. మండ్య తాలుకాలోని పణకనహళ్ళి గ్రామంలో సుమలత మీడియాతో మాట్లాడుతూ..ఫోన్‌ ట్యాపింగ్‌ కేసును సీబీఐకి అప్పగించడం మంచిదేనని అన్నారు. దీంతో ఎవరు ఏం చేశారు అన్న అన్ని నిజాలు బయటకి వస్తాయని చెప్పారు. ఫోన్ల ట్యాపింగ్‌ కేసుపై తప్పకుండా సీబీఐ దర్యాప్తు చేయించాల్సిందేనని పేర్కొన్నారు.

పార్లమెంటు ఎన్నికల సమయంలో తాను కూడా చాలా ఇబ్బందులు పడ్డానని ఆవేదన వ్యక్తం చేశారు. తన ఫోన్‌ కూడా ట్యాప్‌ అయ్యిందేమోనని అనుమానం వ్యక్తం చేశారు. దీనిపై ఆరోపణలు రావడంతో కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారని తెలిపారు. త్వరలోనే ఎవరు ఎవరి ఫోన్లను ట్యాప్‌ చేశారో తప్పకుండా బయటకి వస్తుందని అన్నారు.

Related posts