ప్రాంతీయ పార్టీలపై బీజేపీ ఎంపీ సుజనా చౌదరి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇక భవిష్యత్తులో ప్రాంతీయ పార్టీల చోటు లేదని ఆయన అన్నారు. ప్రాంతీయ పార్టీలన్నీ కుటుంబాల చేతుల్లో ఉన్నాయని చెప్పారు. గాంధీ సంకల్పయాత్ర విజయవంతంగా సాగుతుందని తెలిపారు.
ఏ కాలానికైనా గాంధీ సిద్ధాంతాలు ఆచరణీయమని అన్నారు. తెలుగు రాష్టాల్లో బీజేపీ ఏ పార్టీతోను పొత్తు పెట్టుకోదన్నారు. రాజధానిపై ప్రజల్లో గందరగోళం ఉన్న మాట వాస్తవమేనని ప్రజాస్వామ్య బద్దంగా గెలిచిన ముఖ్యమంత్రి దీనిపై స్పందించాలన్నారు. రాజధానిపై జాతీయ పార్టీగా ఇప్పుడే ఏమీ స్పందించమని సుజనా చౌదరి పేర్కొన్నారు.
సాధ్వి ప్రజ్ఞా సింగ్ ముమ్మాటికీ ఉగ్రవాదే: సిద్ధరామయ్య