నల్లగొండ సమీపంలో అదుపు తప్పి పోలీస్ బొలెరో వాహనం బోల్తా పడింది. ఈ ప్రమాదంలో వాహనం నడుపుతున్న సబ్ ఇన్స్పెక్టర్ మధు మరణించారు. నల్లగొండ జిల్లా కేంద్రంలో జరుగుతున్న ఈవెంట్స్ బందోబస్తు కోసం ప్రభుత్వ వాహనం బొలెరో నెంబర్ టీఎస్ 09 పీఏ 4020లో స్వంతంగా డ్రైవ్ చేసుకుంటూ నల్లగొండకు వెళ్తుండగా మార్గమధ్యలో ఎల్లారెడ్డిగూడెం సమీపంలో వాహనం అదుపు తప్పి బోల్తా పడింది. వాహనం డ్రైవింగ్ చేస్తున్న యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి ఎస్ఐ మధుసూదన్ తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు గమనించి సమీపంలో గల నార్కట్ పల్లి కామినేని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు.
previous post
రాజశేఖరరెడ్డి కూడు పెడితే..జగన్ పొట్ట కొడుతున్నారు: కన్నా