telugu navyamedia
ఆరోగ్యం

కడుపులో కత్తెర ఘటనపై  చర్యలు: నిమ్స్ డైరెక్టర్

Stumach scissor issue,Nims
హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో రోగికి ఆపరేషన్‌ చేసి కడుపులో కత్తెర మరిచిపోయిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారం పై పేషెంట్ బంధువులు ఆసుపత్రిలో ఈ రోజు ఆందోళనకు దిగారు. ఈ ఘటన పై  నిమ్స్ డైరెక్టర్ మనోహర్ స్పందించారు. కడుపులో కత్తెర మరిచిపోవడం దురదుష్టకరమైన ఘటనన్నారు.
మహేశ్వరి చౌదరి(33) అనే మహిళ డైయాఫ్రమెటిక్ హెర్నియా వ్యాధితో అక్టోబర్ 28న నిమ్స్‌కు వచ్చారని అప్పుడు ఆమెకు సర్జరీ చేసినట్లు తెలిపారు. ఆపరేషన్ సమయంలో వైద్యులు ఆమె కడుపులో కత్తెరను మరిచిపోయి కుట్లు వేశారని ఆయన అన్నారు. తీవ్రమైన కడుపునొప్పితో మహేశ్వరి తిరిగి నిమ్స్‌కు వచ్చారని,సంబంధించి  ఎక్స్‌రే తీయగా ఆమె కడుపులో సర్జికల్ కత్తెర ఉన్నట్లు గుర్తించామన్నారు. ఈ వ్యవహారానికి ఆస్పత్రిలో ఇంటర్నల్ కమిటీ ఏర్పాటు చేశామని, కమిటీ నివేదికలు వచ్చాక ఘటనకు కారణమైన వైద్యులపై చర్యలు తీసుకుంటామని  మనోహర్ వెల్లడించారు.

Related posts