స్నేహితులు కొట్టడంతో మనస్తాపం చెంది ఓ విద్యార్థి రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన జనగామ జిల్లా కేంద్రంలోని వీవర్స్ కాలనీలో చోటు చేసుకుంది. కాలనీకి చెందిన బోగ ప్రభాకర్, లక్ష్మీల కుమారుడు సాయి ప్రసాద్ అనే విద్యార్థి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. స్నేహితులు కొట్టడంతో అవమానం జరిగిందని, అందుకే చనిపోతున్నానని సుసైడ్ నోట్ రాసి చనిపోయాడు.
దీంతో విద్యార్థి తల్లిదండ్రులు, బంధువులు సాయిప్రసాద్ శవంతో అతడి స్నేహితులు పవన్, వరుణ్ల ఇంటి ముందు ధర్నాకు దిగారు. తన కుమారుడిని కొట్టినవారిని అరెస్టు చేయాలని మృతుడి తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఏసీపీ వినోద్ కుమార్ బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నారు.