నేడు స్టాక్ మార్కెట్లు స్వల్ప లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 66 పాయింట్లు లాభపడి 39,750 వద్ద, నిఫ్టీ కేవలం 4 పాయింట్ల లాభంతో 11,929 వద్ద ముగిశాయి.
ఎన్ఎస్ఈలో జీ ఎంటర్ టైన్ మెంట్స్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, యస్ బ్యాంక్, ఇన్ఫోసిస్, కోల్ ఇండియా సంస్థల షేర్లు లాభపడ్డాయి.
భారతీ ఇన్ ఫ్రాటెల్, బజాజ్ ఆటో, హీరో మోటార్స్, గ్రాసిమ్, అల్ట్రాటెక్ సిమెంట్ సంస్థల షేర్లు నష్టాలు చవిచూశాయి.
డాలర్ తో రూపాయి మారకం విలువ 69.70గా కొనసాగుతోంది.