యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తన 22వ చిత్రంగా ‘ఆదిపురుష్’ అనే సినిమాని చేస్తున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ సంచలన దర్శకుడు ఓం రౌత్ (తానాజీ ఫేమ్) దర్శకత్వంలో ‘ఆదిపురుష్’ అనే భారీ చిత్రం తెరకెక్కనుంది. ‘చెడు మీద మంచి సాధించిన విజయం’ అనేది ట్యాగ్ లైన్. రామాయణం ఆధారంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ‘ఆదిపురుష్’ సినిమాను హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం భాషల్లో భారీ బడ్జెట్తో రూపొందిస్తున్నారు. ఈ సినిమాని దాదాపు 350 కోట్ల బడ్జెట్తో టీ-సిరీస్ నిర్మిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమాలో ప్రభాస్ రాముడి పాత్రలో కనిపించనున్నాడు. ఈ ప్రాజెక్టు ప్రకటించినప్పటి నుంచి అభిమానులు పలు డిజైన్లతో ప్రభాస్ ఫొటోలను రూపొందించి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. తాజాగా ఓ అభిమాని ఆదిపురుష్ థీమ్ తో ప్రభాస్ సెంట్రల్ పేరుతో పోస్టర్ ను రూపొందించాడు. ఈ ఫొటోకు ఓం రావత్ ఇంప్రెస్ అయిపోయాడు. ఫ్యాన్ మేడ్ పోస్టర్ ను ట్విటర్ లో షేర్ చేస్తూ..ఈ ఫొటో స్టన్నింగ్ గా ఉంది. దీని ద్వారా ఆదిపురుష్ (ప్రభాస్)కు మరింత శక్తి వస్తుంది..అంటూ ఓం రావత్ ట్వీట్ చేశాడు. 2021 జనవరి నుంచి ఆది పురుష్ సెట్స్ పైకి వెళ్లనున్నట్టు తెలుస్తోంది.
This is stunning. More power to you @PrabhasCentral.#Adipurush #Prabhas https://t.co/8Gqzy5cQBO
— Om Raut (@omraut) November 9, 2020