తెలంగాణ విద్యార్థులు, తల్లిదండ్రులు ఎంతగానో ఎదురు చూస్తున్న పదో తరగతి ఫలితాల వెల్లడికి తేదీని విద్యాశాఖ వెల్లడించింది. సోమవారం ఉదయం 11:30 గంటలకు ఫలితాలను వెల్లడించనున్నట్టు విద్యాశాఖ పేర్కొంది. ఇంటర్మీడియట్ ఫలితాల్లో నెలకొన్న గందరగోళ పరిస్థితులు పదో తరగతి ఫలితాల్లోనూ పునరావృతం కాకుండా విద్యాశాఖ తగు జాగ్రత్తలు తీసుకుంది.
రేపు ఉదయం విద్యాశాఖ కార్యదర్శి జనార్ధన్రెడ్డి ఈ ఫలితాలను విడుదల చేయనున్నారు.రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు మార్చి 16 నుంచి ఏప్రిల్ 3వ తేదీవరకూ జరిగాయి. కాగా ఇంటర్ ఫలితాల వెల్లడిలో గందరగోళం నెలకొన్న నేపథ్యంలో ఫలితాల విడుదలలో ఎలాంటి సాంకేతిక లోపం తలెత్తకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.