మే 24 నుంచి ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ, ఎస్ఎస్సీ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు ఎన్టీఆర్ జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్వో) వి.శ్రీనివాసరావు ప్రకటించారు.
మే 24 నుంచి జూన్ 1 వరకు ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలు జరుగుతాయని, మే 24 నుంచి జూన్ 3 వరకు ఎస్ఎస్సీ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరుగుతాయని డీఆర్వో తెలిపారు.
ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం సప్లిమెంటరీ పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగుతాయని తెలిపారు.
ఇంటర్ ద్వితీయ సంవత్సరం సప్లిమెంటరీ పరీక్షలు మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 5:30 వరకు జరుగుతాయి.
పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించనున్నట్లు శ్రీనివాసరావు తెలిపారు. పరీక్షల్లో అవకతవకలు నిరోధించేందుకు ఫ్లయింగ్ స్క్వాడ్లను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు
జగన్ను గెలిపిస్తే కేసీఆర్ కాళ్లు మొక్కుతారు: చంద్రబాబు