తెలంగాణ రాష్ట్రంలో మార్చిలో నిర్వహించిన ఎస్సెస్సీ పరీక్షల ఫలితాలు త్వరలో విడుడుల కానున్నాయి. వచ్చే నెల రెండోవారంలో పదో తరగతి పరీక్షా ఫలితాలు వెల్లడించనున్నట్టు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ టీ విజయ్కుమార్ తెలిపారు. శనివారం తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. మార్చి 16 నుంచి ఏప్రిల్ మూడో తేదీ వరకు పరీక్షలు నిర్వహించామని, విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మూల్యాకన పనులు కొనసాగుతున్నాయని, ఫలితాల విడుదలకు అన్ని రకాల ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెప్పారు.
previous post