చైనా నుండి వచ్చిన కరోనా ప్రపంచం మొత్తని అతలాకుతల చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ వైరస్ దేశంలో కరోనా అల్లకల్లోలం సృష్టిస్తోంది. రోజురోజుకు దేశంలో కరోనా కేసులు వేల సంఖ్యలో పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే ఎందరో రాజకీయ నాయకులు కరోనా బారిన పడ్డారు. అయితే.. తాజాగా దర్శకుడు రాజమౌళి తండ్రి, రచయిత విజయోంద్రప్రసాద్ కు కరోనా సోకింది.ఈ విషయాన్ని స్వయంగా సోషల్ మీడియా వేదికగా ఆయన పేర్కొన్నారు. “నాకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. నా స్నేహితులు వృత్తిపరమైన భాగస్వాములు.. దయచేసి రెండు వారాలు ఫోనులు చేయవద్దు. త్వరలోనే నేను కోలుకుంటాను” అని విజయేంద్రప్రసాద్ తెలిపారు. కాగా.. టాలీవుడ్లో ఇప్పటికే అల్లు అరవింద్, వకీల్సాబ్ హీరోయిన్ నివేదా థామస్కు కరోనా సోకిన విషయం తెలిసిందే.
previous post