ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్చరణ్ కథానాయకులుగా నటిస్తున్న మల్టీస్టారర్ చిత్రం ‘ఆర్ఆర్ఆర్’ (రణం రౌద్రం రుధిరం). అలియాభట్, ఓలివియా మోరీస్ కథానాయికలుగా నటిస్తున్నారు. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. తెలంగాణ గోండు వీరుడుకొమురం భీమ్గా తారక్, మన్యంవీరుడు అల్లూరి పాత్రలో రామ్చరణ్ నటిస్తున్నారు. అజయ్దేవగణ్, అలియా భట్, రే స్టీవెన్సన్, అలిసన్ డూడీ వంటి బాలీవుడ్, హాలీవుడ్ స్టార్స్ నటిస్తున్న భారీ బడ్జెట్ మూవీ ఇది. ఈ సినిమా షూటింగ్ త్వరలోనే రీ స్టార్ట్ కానుంది. ఈ నేపథ్యంలో రాజమౌళి సినిమా సంబంధిత ఆలోచనలను పక్కన పెట్టి గ్యాప్ తీసుకున్నారు. సతీమణి రమా రాజమౌళితో కలిసి కర్ణాటకలోని బందీపూర్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ వెళ్లారు. అటవీశాఖాధికారుల సహకారంతో జక్కన్న అడవిలో పర్యటించారట. కూడా అంతకు ముందుగానే అక్కడికి సమీపంలోని హిమవద్ గోపాలస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఇప్పుడు ఈ ఫొటోలు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. ఈ గ్యాప్ తర్వాత రాజమౌళి తన దృష్టిని ‘ఆర్ఆర్ఆర్’పై ఫోకస్ చేయనున్నారు.
previous post