telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

కాంగ్రెస్‌ నేతలు నోరుదగ్గరపెట్టుకుని మాట్లాడాలి: తలసాని

Minister Talasani Fire to Chandrababu

కాంగ్రెస్‌ నేతలు నోరుదగ్గరపెట్టుకుని మాట్లాడాలని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌సూచించారు. తెలంగాణభవన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ పార్టీ ఫిరాయింపులపై టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని అన్నారు. కాంగ్రెస్‌లోకి ఎమ్మెల్యేలను లాక్కున్నప్పుడు ఈనీతులు ఏమయ్యాయని ప్రశ్నించారు. స్పీకర్‌ హైదరాబాద్‌లో ఉండకుండా పారిపోయారని కాంగ్రెస్‌ నేతలు మాట్లాడటం అర్థరహితమన్నారు.

మంత్రి జగదీశ్‌రెడ్డిని రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు కోరుతున్నాయని, రాష్ట్రంలో ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్న సంగతిని మరిచి ఇటువంటి రాజకీయాలు చేయడం సరికాదని ఆయన హితవు పలికారు. కాంగ్రెస్‌ నేతలు ఎప్పుడూ వార్తల్లో ఉండేందుకే ప్రభుత్వంపై విమర్శలు చేస్తుంటారని ఆయన మండిపడ్డారు.కాంగ్రెస్‌ నేతలు గవర్నర్‌ నరసింహన్‌ను కలసి రాష్ట్రంలో రాజ్యాంగ సంక్షోభం ఉందన్నట్టుగా మాట్లాడటం విడ్డూరంగా ఉందని తలసాని వ్యాఖ్యానించారు.

Related posts