telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

అవ్వా .. శ్రీముఖికి మరీ ఇంత పచ్చిగా అడిగిందేంటి?

బుల్లితెరపై టాప్ యాంకర్లు ఒకరు శ్రీముఖి.. అంతేకాదు హాట్ యాంకర్ గా పేరు ఉంది. ఇటీవల బిగ్ బాస్ సీజన్ 3 లో పాల్గొన్న ఈ అమ్మడు రన్నర్ గా నిలిచింది. అయితే, తర్వాత యాంకర్ గా పెద్దగా కనిపించలేదు. ఇది ఇలా ఉండగా ఇప్పుడు యాంకర్ గా అలరించడానికి రెడీ అయింది. తెలుగులో ప్రసారమవుతున్న అదిరింది షో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. జబర్దస్త్ నుంచి వచ్చిన మెగా బ్రదర్ నాగబాబు ఈ షో కు జడ్జ్ గా చేస్తున్నారు.ధనరాజ్, వేణు, చమ్మక్ చంద్ర వంటి కొంతమంది టీం లీడర్స్ ఈ షోను పైకి లేపడానికి కష్టపడుతున్నారు. ఎంత కష్టపడినా షో రేటింగ్ అంతంత మాత్రంగానే ఉంది.

అదిరింది’ కొత్త షో ప్రారంభించారు. ఆ షో హోస్ట్ గా శ్రీముఖి ఉండగా , నాగబాబు, జానీ మాస్టర్లు జడ్జీలు గా వ్యవహరించనున్నారు. తాజాగా విడుదల చేసిన ప్రోమోలో యాంకర్ శ్రీముఖి నాగబాబుతో కలిసి గట్టిగానే డబుల్ మీనింగ్ డైలాగ్‌లు పేల్చింది. ఢీ ఫేమ్ పండు అదిరిపోయే డ్యాన్స్ చేశాడు. హీరో మాదిరి బిల్డప్ ఇచ్చాడు.. నీ బాధ ఏంటిరా అంటూ అతని గాలి తీసేశాడు నాగబాబు. ‘నాకు త్వరగా పెళ్లి చేసేయండి డాడీ’ అని నాగబాబుని పండు అడగడంతో.. ‘నీకింకా పెళ్లి చేసుకునేంతగా పండలేదని నా ఉద్దేశం’ అని పంచ్ ఇచ్చారు. శ్రీ ముఖి మాట్లాడుతూ.. ‘ఈ పండు పండిందట.. దానికి పెళ్లి కావాలట అంటూ ఓ రేంజులో మాట్లాడింది.. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.

Related posts