కొయ్యలగూడెంకు చెందిన మావుడూరి ఉమామహేష్ కుటుంబసభ్యులు రెండేళ్లుగా కొవ్వూరులో నివసిస్తున్నారు. ఉమామహేష్ ఇంటర్ పూర్తయిన తరువాత నెట్ వర్కింగ్ అండ్ కమ్యూనికేషన్ కోర్సు నేర్చుకుని 2015లో మస్కట్ వెళ్లి అక్కడ ఓ హోటల్లో సూపర్వైజర్గా చేరాడు. అదే హోటల్లో శ్రీలంకకు చెందిన రుమాళి హేమాళి 2017లో సూపర్వైజర్గా చేరింది. అలా వారి పరిచయం ప్రేమగా మారింది. రెండేళ్లుగా ప్రేమించుకుంటున్న వారిద్దరూ వారం క్రితం కొవ్వూరు వచ్చారు. ఇరువైపులా పెద్దల అంగీకారంతో స్థానిక ధర్మప్రచార ఆచార్య సిద్దాంత పీఠంలోని రమా సహిత వీరవెంకటసత్యనారాయణస్వామి వారి ఆలయంలో బంధువుల మధ్య మూడు ముళ్ల బంధంతో ఆదివారం వారిద్దరూ ఒక్కటయ్యారు. ఈ సందర్భంగా వధూవరులను స్త్రీ, శిశు సంక్షేమశాఖ మంత్రి తానేటి వనిత ఆశీర్వదించారు.
అప్పులే తప్ప తన వద్ద డబ్బులేమీ లేవు: ఎమ్మెల్యే జగ్గారెడ్డి