telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

రాపాక పార్టీ మార్పుపై .. అద్దెపల్లి శ్రీధర్ స్పష్టత.. నేడో రేపో ముహూర్తం ..!

rigging case on rapaka varaprasad

ఏపీ రాజకీయాల్లో కొత్త బాటలు వేస్తామని ఎన్నో మాటలు చెప్పిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్..చివరికి ఆయనే గెలువలేకపోయిన సంగతి తెలిసిందే. జనసేన పార్టీ మొత్తం మీద ఒకే ఒక వ్యక్తి గెలుపు బాట వేసి కాస్త పరువు నిలబెట్టాడు. ఆలా నిలబెట్టిన వ్యక్తిని పార్టీ పట్టించుకోవడం లేదనే వార్తలు గత కొద్దీ రోజులుగా మీడియా లో వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆ ఎమ్మెల్యే రాపాక వైసీపీ పార్టీ లో చేరబోతున్నట్లు వార్తలు ప్రచారం జరిగాయి. కాకపోతే ఆ వార్తల్లో నిజం లేదని రాపాక తెలిపి ఆ వార్తలను ఖండించారు.

ఇటీవల జనసేన నుంచి వైసీపీలో చేరిన అద్దెపల్లి శ్రీధర్ మాత్రం రాపాక వైసీపీ తీర్థం పుచ్చుకోవడం ఖాయమని చెప్పడం జనసేన కార్యకర్తలకు షాక్ ఇస్తున్నాయి. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో దీనిపై స్పందించిన శ్రీధర్. రాపాక వరప్రసాద్‌కు జనసేనలో సన్నిహితంగా ఉండే ముగ్గురు నాయకులు వైసీపీలో చేరిపోయారని. కాబట్టి ఆయన కూడా వైసీపీలో చేరే అవకాశం ఉందని ఆయన కామెంట్ చేశారు. అయితే దీనిపై తుది నిర్ణయం తీసుకోవాల్సింది ఆయనే అని తెలిపారు.

Related posts