హరీష్ శంకర్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న చిత్రం “వాల్మీకి”. ఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోంది. ఈ చిత్రానికి మిక్కి జె మేయర్ సంగీతం అందిస్తున్నారు. 14 రీల్స్ సంస్థపై రామ్ ఆచంట, గోపి ఆచంటలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో హీరో వరుణ్ తేజ్ సరికొత్త మాస్ లుక్ లో దర్శనమిస్తున్న సంగతి తెలిసిందే. ఫస్ట్ లుక్ తోనే మాస్ ఆడియెన్స్ లో అంచనాలు రేపాడు. తమిళ్ సినిమా జిగర్తాండకు ఈ సినిమా రీమేక్. ఈ సినిమాలో తమిళ్ హీరో అథర్వ ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 13న విడుదల చేయనున్నట్టు పోస్టర్ ద్వారా తెలిపారు మేకర్స్. ప్రముఖ తమిళ్ హీరో మురళి తనయుడు యువ హీరో అధర్వ ఈ చిత్రంలో ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. పూజా హెగ్డే, మృణాలిని రవి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటివరకు డిఫరెంట్ జోనర్స్లో, విభిన్నమైన పాత్రలు చేస్తూ ప్రేక్షకుల్ని మెప్పిస్తున్న వరుణ్తేజ్ ఈ సినిమాలో గ్యాంగ్స్టర్గా మరో డిఫరెంట్ క్యారెక్టర్లో కనిపించబోతున్నారు. ఇటీవల చిత్ర టీజర్ విడుదల కాగా, దీనికి మంచి ప్రేక్షకాదరణ లభించింది.
కాగా… కుటుంబ కథా చిత్రాల్లో ముఖ్యంగా 1980-90 దశకంలో మహిళల్లో శోభన్బాబుకు ఉన్న ఇమేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలాగే ఇటు దక్షిణాది చిత్రాల్లో తనదైన నటనతో అభిమాన గణాన్ని సంపాదించుకున్న దివంగత తార శ్రీదేవి. వీరిద్దరూ కలిసి నటించిన చిత్రాల్లో ‘దేవత’ ఒకటి. 1982లో ఈ సినిమా విడుదలై మంచి విజయాన్ని దక్కించుకుంది. ఈ సినిమాలోని “ఎల్లువెత్తి గోదారమ్మ…” సాంగ్ చాలా పెద్ద హిట్. ఈ సాంగ్ను ఇప్పుడు వరుణ్తేజ్, అధర్వ మురళి, పూజా హెగ్డే, మృణాళిని రవి ప్రధాన తారాణంగా రూపొందుతోన్న `వాల్మీకి`లో రీమిక్స్ చేస్తున్నారు. గోదావరి పరిసర ప్రాంతాల్లో వరుణ్తేజ్, పూజాహెగ్డేలపై ఈ సాంగ్ను చిత్రీకరిస్తున్నారని సమాచారం.
18 ఏళ్ళ వయసులో వైరాముత్తు నా నడుం పట్టుకుని… ఎలా నిరూపించాలి ? : చిన్మయి