telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు సామాజిక

ఏప్రిల్ 5 నుంచి వొంటిమిట్ట లో శ్రీరామ నవమి వార్షిక బ్రహ్మోత్సవాలు

సోమవారం తిరుమలలోని అన్నమయ్య భవన్‌లో జరిగిన బోర్డు సమావేశంలో టిటిడి చైర్మన్ బిఆర్ నాయుడు, ఈఓ శ్యామలరావుతో కలిసి శ్రీరామ నవమి వార్షిక బ్రహ్మోత్సవాల బుక్‌లెట్‌ను విడుదల చేశారు.

ఈ సందర్భంగా టిటిడి చైర్మన్ మాట్లాడుతూ, ఏప్రిల్ 5 నుండి 15 వరకు వార్షిక ఉత్సవాలు ఘనంగా జరుగుతాయని, ఏప్రిల్ 11న శ్రీ సీతారామ కళ్యాణం రాష్ట్ర ఉత్సవం జరుగుతుందని తెలిపారు.

టీటీడీ ట్రస్ట్ బోర్డు సభ్యులతో పాటు అదనపు ఈఓ సిహెచ్ వెంకయ్య చౌదరి, జేఈఓ వీరబ్రహ్మం కూడా హాజరయ్యారు.

Related posts